మంచాల : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, హత్య, దొంగతనాలు, నేరాలు కేసుల్లో తప్పించుకోని తిరుగుతున్న వారిని పట్టించడంలో నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని ఏసీసీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకే అన్ని గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లంకి అనిత, ఉపసర్పంచ్ వెంకటేష్, వైస్ఎంపీపీ రాజేశ్వరి, సీఐ వెంకటేష్గౌడ్, ఎస్సై సురేష్, మదన్గౌడ్ పాల్గొన్నారు.