మోమిన్పేట : తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా అదుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 60మంది, సీఎంఆర్ఎఫ్ 20మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకంతో రాష్ట్రంలో బాల్య వివాహలు తగ్గాయని, పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎంతోమంది ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నరన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, పసిపాప నుంచి పండుముసలవ్వ వరకు ప్రతీ దశలో ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ వసంత, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు అంజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు విఠల్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శైలజారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.