బొంరాస్పేట : మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, మూడు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు రూ. 5లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం ఎంపీటీసీ శ్రవణ్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, ఉప సర్పంచ్ అంజిలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ సుభాశ్రావు, మండల యూత్ అధ్యక్షుడు మహేందర్, మైనార్టీ అధ్యక్షుడు సలాం, మైనార్టీ నాయకుడు అబ్దుల్ వాహబ్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్గౌడ్, లచ్చప్ప తదితరులు గురువారం ఎమ్మెల్యేను హైదరాబాద్లో కలిసి బొంరాస్పేట అభివృద్ధిపై చర్చించారు.
సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, హైమాస్ట్ లైట్లకు నిధులు కేటాయించాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొంరాస్పేటలో అభివృద్ధి పనులకు రూ.కోటి మంజూరు చేయాలని సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే పెట్రోల్ బంకు నుంచి భూలక్ష్మి ఆలయ రస్తా వరకు డ్రైనేజీ పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, తాలుకా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్, రవిగౌడ్, అనంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రెండు బోర్లకు జడ్పీ నిధులు
మండల కేంద్రంలోని జామియా మసీదు, ముస్లిం శ్మాశన వాటికలో రెండు తాగునీటి బోర్లు వేసేందుకు జడ్పీ నిధులు మంజూరు చేయాలని టీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షుడు సలాం, మైనార్టీ నాయకుడు అబ్దుల్ వాహబ్ జడ్పీటీసీ అరుణాదేశును కోరగా ఆమె సానుకూలంగా స్పందించి బోర్లు వేయడానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.