వికారాబాద్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభస్వామిని గురువారం గరుడ వాహనంపై భక్తులు ఊరేగించారు. స్వామివారిని అందంగా అలంకరించి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. ఆలయ పురవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తున్న సమయంలో భక్తులు అధికం సంఖ్యలో పాల్గొని మంగళహారతులు పట్టి ప్రత్యేక పూజలు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్లు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకీ మోస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అధికారులు ఘనంగా సన్మానం చేశారు. వీరి వెంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు రామస్వామి, పుష్పలతరెడ్డి, ఆర్. నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు.