అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు సైతం మందులు, వ్యాక్సిన్ తరలించేందుకు ఉపయోగించిన ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ట్రయల్ రన్స్ సక్సెస్ అయ్యింది. పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ ఎంపిక కాగా, సెప్టెంబర్ 11న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకు మొత్తం 8 కన్సార్టియంలు అనుమతులు పొందగా, ఇప్పటి వరకు ఏడింటి ట్రయల్న్ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన ఒక కన్సార్టియం ట్రయల్ రన్ కొనసాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 400 ఫీట్ల లోపు ఎత్తులో అత్యధిక దూరం బొంరాస్పేట్ పీహెచ్సీకి డ్రోన్తో వ్యాక్సిన్, మందులు తరలించారు.
పరిగి, అక్టోబర్ 20 : మారుమూల ప్రాంతాలకు అత్యవసర సమయాల్లో మందులు, వ్యాక్సిన్ తరలింపునకు సంబంధించి ప్రారంభించిన ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమం ట్రయల్ రన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే మొదటిసారిగా ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమానికి వికారాబాద్ ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. సెప్టెంబర్ 11వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు వికారాబాద్లో ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. సభావేదిక పక్క నుంచే రామయ్యగూడలోని దవాఖానకు డ్రోన్ ద్వారా మందులు తరలించే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం వికారాబాద్ సమీపంలోని కొత్త ఏరియా దవాఖాన ప్రాంగణం నుంచి నిర్దేశించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లను తరలించే ప్రక్రియను ఆయా కన్సార్టియంలు చేపట్టాయి. మొత్తం 8 కన్సార్టియంలు ఇందుకు అనుమతులు పొందగా, ఇప్పటివరకు 7 కన్సార్టియంలకు సంబంధించిన ట్రయల్న్ విజయవంతంగా పూర్తయింది. 8వ కన్సార్టియం ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ ట్రయల్ రన్స్ పూర్తయిన తర్వాత పెద్ద సైజు, అధిక బరువు తీసుకువెళ్లే డ్రోన్ల ట్రయల్ రన్స్ కోసం అనుమతులు వచ్చినట్లు సమాచారం.
8 కన్సార్టియంలకు ట్రయల్ రన్ అనుమతులు
మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమంలో భాగంగా మొత్తం 8 కన్సార్టియంలకు ట్రయల్ రన్ కోసం అనుమతులు లభించాయి. ఇందుకు సంబంధించి బ్లూడార్ట్ మెడ్ ఎక్స్ప్రెస్ కన్సార్టియం(స్కై ఎయిర్), క్యూరిస్ఫ్లై కన్సార్టియం(టెక్ ఈగల్ ఇన్నోవేషన్స్), డన్జో మెడ్ ఎయిర్ కన్సార్టియం(స్కై ఎయిర్), ఫ్లిప్కార్ట్ ఎయిర్ కన్సార్టియం(ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్), హెలికాప్టర్ కన్సార్టియం(మారుత్ డ్రోన్స్), మెడిస్కై కన్సార్టియం(సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్), రెడ్వింగ్ కన్సార్టియం(రెడ్వింగ్ ల్యాబ్స్)లు ట్రయల్ రన్ కోసం అనుమతులు పొందగా ఇప్పటివరకు 7 కన్సార్టియంలు తమ ట్రయల్న్న్రు విజయవంతంగా పూర్తి చేశాయి. మారుత్ డ్రోన్స్ ట్రయల్ రన్ పూర్తి కావాల్సి ఉన్నది.
400 ఫీట్ల ఎత్తు లోపే డ్రోన్ల ప్రయాణం
వికారాబాద్ పట్టణ ఏరియా దవాఖాన ప్రాంగణం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు డ్రోన్ల సహాయంతో మందులు, వ్యాక్సిన్లను తరలించారు. శంషాబాద్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి అనుమతులు పొందడం జరుగుతుంది. ఏటీసీ అనుమతులు వచ్చిన వెంటనే డ్రోన్ ద్వారా నిర్ణీత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్, మందులు చేరవేశారు. అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ప్రాంతం లొకేషన్ పంపిస్తే కచ్చితమైన స్థలానికి ఈ డ్రోన్ వచ్చి ల్యాండ్ అవుతుంది. డ్రోన్ 400 ఫీట్ల కంటే తక్కువ ఎత్తులోనే ఈ డ్రోన్లు ప్రయాణం సాగించాలి. అంతకంటే ఎక్కువ ఎత్తులో విమానాలు ఎగురుతుంటాయి. అందువల్ల ఏటీసీ వారు సూచించిన విధంగా 400 ఫీట్ల లోపు ఎత్తులోనే డ్రోన్లు ప్రయాణిస్తాయి. ఇప్పటివరకు జిల్లాలోని పరిగి క్లస్టర్ హెల్త్ సెంటర్, పూడూరు పీహెచ్సీ, సిద్దులూరు పీహెచ్సీ, బొంరాస్పేట్ పీహెచ్సీలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ చేరవేయడం విజయవంతంగా పూర్తయింది. అత్యధికంగా బొంరాస్పేట్కు ఆకాశమార్గంలో సుమారు 28 కిలోమీటర్లు దూరం డ్రోన్ ప్రయాణించి వ్యాక్సిన్ చేరవేసిందని అధికారులు తెలిపారు. నిర్దేశిత ప్రాంతంలో డ్రోన్ దిగిన తర్వాత ఔషధాలు ఉన్న బాక్స్ను సొంతంగా వదిలేసి తిరిగి బేస్కు వెళ్లిపోతుంది.
నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య వ్యాక్సిన్ తరలింపు
అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందులు, వ్యాక్సిన్లను ఈ డ్రోన్ల ద్వారా తరలించే ప్రక్రియ చేపట్టడమే ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా డ్రోన్ కింది భాగంలోని ప్రాంతంలో మెడిసిన్, వ్యాక్సిన్లు ఉన్న బాక్స్ ఉంచడానికి ప్రత్యేక స్థలం ఉంటుంది. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ తరలింపునకు, వ్యాక్సిన్ క్యారియర్ల కోసం ఉపయోగించే ఐస్ప్యాక్ పెట్టి 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య వ్యాక్సిన్ను నిర్ణీత ప్రాంతాలకు విజయవంతంగా చేరవేశారు. ఐస్ప్యాక్ల వల్ల 24 గంటలపాటు ఇదే ఉష్ణోగ్రత మధ్య వ్యాక్సిన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన ట్రయల్ రన్లో భాగంగా 10 కిలోల వరకు పెలోడ్ను ఈ డ్రోన్లు నిర్ణీత ప్రాంతాలకు చేరవేశారు. డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు ఎంత ఉష్ణోగ్రతల మధ్య పంపించారు. నిర్ణీత ప్రాంతం చేరుకున్న తర్వాత ఎంత ఉష్ణోగ్రతల మధ్య ఉన్నాయి తదితర అన్ని అంశాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ నివేదికలు సిద్ధం చేశారు. అపోలో సంస్థల వారు ఈ వ్యాక్సిన్, మందులకు సంబంధించిన అంశాలు పరిశీలించారు.
అధిక బరువు తరలింపునకు అనుమతులు
ఇప్పటివరకు తక్కువ బరువుతో తక్కువ దూరం వరకు ఔషధాల పెట్టెలను తరలించే డ్రోన్లకు సంబంధించిన ట్రయల్ రన్స్ చేపట్టగా, రెండో విడుతలో అధిక బరువు గల పెద్ద డ్రోన్లతోఅధికంగా బరువు గల ఔషధాల పెట్టెలను ఎక్కువ దూరం తరలించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి సైతం అనుమతులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. తొలివిడుత ట్రయల్న్స్ పూర్తవగానే రెండో విడుతలో పెద్ద పరిమాణంలో డ్రోన్లతో అధిక బరువు ఔషధాల పెట్టె తరలింపు ట్రయల్ రన్స్ చేపట్టనున్నారు.
విజయవంతంగా ట్రయల్న్స్
అత్యవసర సమయాల్లో మందులు, వ్యాక్సిన్లను ఆకాశ మార్గంలో తరలించేందుకు సంబంధించిన ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమంలో భాగంగా డ్రోన్లతో నిర్దేశిత ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలింపు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. మొత్తం 8 కన్సార్టియంలకు ఆకాశ మార్గంలో వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా తరలింపు ప్రక్రియకు సంబంధించిన ట్రయల్న్క్రు అనుమతులు లభించాయి. ఇప్పటివరకు 7 కన్సార్టియంల ట్రయల్న్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. 8వ కన్సార్టియం ట్రయల్న్స్ కొనసాగుతున్నాయి.