వికారాబాద్, జూలై 9 : వనసంపదను పెంచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కొత్రేపల్లి వద్ద ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా ఎస్పీ నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో 7వ విడుత హరితహారంలో భాగంగా కొత్రేపల్లి నుంచి నూతన కలెక్టరేట్ వరకు 6 కిలోమీటర్లు, 4వేల మొక్కలు నాటారు. 9 రోజుల పాటు ఈ కార్యక్రమానికి కృషి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్కుమార్ శ్రమను గుర్తించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ఆయా శాఖల అధికారులు తీసుకొని 100శాతం బతికించాలని సూచించారు.
6.2కిలో మీటర్లు, రోడ్డుకు ఇరువైపులా 12.4కిలో మీటర్లు 11శాఖల సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. వన సంపద పెరిగితే ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందన్నారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్టు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అభివృద్ధి పనులు పకడ్బందీగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులరమేష్కుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, ఆయా శాఖల అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మొక్కలతోనే మానవ మనుగడ
హరితహారాన్ని పెద్దఎత్తున నిర్వహించుకొని ప్రాణవాయువును కాపాడుకుందామని, అడవుల సంరక్షించి వన్యప్రాణులకు రక్షణ కల్పిద్దామని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ ప్రాతంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హరితహారంతో చెట్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అడవులు పెరిగితే వన్యప్రాణులను కాపాడుకునే ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ మహిపాల్, అటవీ అధికారులు ఎఫ్ఆర్వో వినయ్నాయక్, డీఆర్వో అజాదుల్లా, బీట్ ఆఫీసర్ షకీల్, సెక్షన్ అధికారి నర్సింహులుతో పాటు అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
దేశానికే ఆదర్శంగా పల్లెప్రగతి కార్యక్రమం నిలిచిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రరెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని దేవర్ఫస్లవాద్, గోఖఫస్లవాద్, చెల్లాపూర్ గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనాలను ప్రారంభించారు. చెల్లాపూర్ రూ.5లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనం, రూ.10లక్షలతో బీసీ కమ్యూనిటీ భవనం, రూ.10లక్షలతో మహిళా సమైఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవర్ఫస్లవాద్ గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్, వ్యవసాయ జిల్లా అధికారి గోపాల్, ఏడీఏ వినయ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శశంక్మిశ్రా, ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈ లక్ష్మణరావు, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్కుమార్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, ప్రమోద్రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు మల్లేశం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భగవంతు, గ్రామ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, విద్యుత్ శాఖ ఏఈ, ఎంపీటీసీ, సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.