తుర్కయాంజాల్ : అబ్ధుల్లాపూర్మెట్ మండల పరిధి కుత్భుల్లాపూర్లో నూతనంగా చేపట్టిన భూనీలా సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామి వారి కల్యాణం నిర్వహించారు. నవీన్చారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రఘునందనచారి నేతృత్వంలో వేద మంత్రాల సాక్షిగా భూనీలా వేంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని గ్రామస్తులు కన్నుల పండువగా జరిపించారు. గ్రామ సర్పంచ్ ముద్దం స్వరూప వీరస్వామి యాదవ్, ఆలయ కమటీ చైర్మన్ మైసగోని సంపత్కుమార్గౌడ్, ఉప సర్పంచ్ దేవుని మంగ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీలు సందుల బాల్రాజ్, లలితరాములు, వార్డు సభ్యులు కొత్తగంటి సంపూర్ణ, ఆవుల బాబు, కావలి నిఖిల్, మేకల హారిక, డైరక్టర్ బద్దుల కృష్ణాయాదవ్, కో-ఆప్షన్ మెంబర్ తొంట బాబు, మాడ్గుల రవీందర్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.