హైదరాబాద్: జీహెచ్ఎంసీ శివార్లలోని శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలోని ఔటర్రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుడు ఆంధ్రపదేశ్లోని ఒంగోల్కు చెందిన నేలపాటి సుధీర్ ఉన్నారని తెలిపారు. ఆయన మలక్పేటలోని యశోదా దవాఖానలో ఆర్థోపెడీషియన్గా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.