రంగారెడ్డి : కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. స్థానిక జేఎంజే ఉన్నత పాఠశాలలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా 7, 10 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏడు వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.