కడ్తాల్ : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడ్తాల్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన క్యామ వెంకటేశ్, యువజన విభాగం అధ్యక్షుడు కృష్ణను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే టీఆర్ఎస్కు మూల స్తంభాలని, గ్రామాలు, తండాల్లో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని కోరారు.
టీఆర్ఎస్లో పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని, వారికే పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తున్నదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదిలోపు నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులను ఎన్ను కుంటామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ గోపాల్, ఉప సర్పంచ్ రామకృష్ణ, మండల మహిళ అధ్యక్షురాలు వాణిశ్రీ, నాయకులు చందోజీ, గంప శ్రీను, జహంగీర్అలీ, యాదయ్య, లాయక్అలీ, భిక్షపతి, రాంచంద్రయ్య, నాగార్జున, శివ పాల్గొన్నారు.