కేశంపేట : నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన ఢిల్లీ కృష్ణయ్య అనే వ్యక్తికి శుక్రవారం రూ. 2లక్షల ఎల్ఓసీ చెక్కును అందజేశారు. కృష్ణయ్య గత కొన్ని రోజలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. సహాయం కోసం కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఆశ్రయించగా సీఎం సహాయనిధి నుంచి రూ. 2లక్షలు మంజూరు చేయించారు. చెక్కు అందుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బడ్క వెంకటయ్య, నాయకులు పాల్గొన్నారు.