బషీరాబాద్ : ప్రతి ఒక్కరూ సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, సేవ కార్యక్రమాలకు తనవంతు సహయ సహకారాలు ఉంటాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముజ్తబా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలకు నావంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైల్రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అబ్ధుల్ ఆహాద్, ముస్తఫా, హామీద్, జునైద్, తహెర్, ఖాదీర్, ఇబ్రహీం పాల్గొన్నారు.