అబ్దుల్లాపూర్మెట్ : పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని శివగార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ బుర రేఖమహేందర్గౌడ్, జడ్పీటీసీ బింగి దాసుగౌడ్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవరమయ్యే ధ్రువపత్రాలు సకాలంలో ఇప్పించేందుకు సర్పంచులు, కౌన్సిలర్లు బాధ్యత తీసుకోవాలని కోరారు.
కళ్యాణలక్ష్మి, షాదిముబారక్తో పాటు నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కూడా అత్యధికంగా ఇవ్వడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వానకి రూ. లక్ష కోట్ల నష్టం జరిగిందని అయినప్పటికీ ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్, ఆసరా పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మండల కేంద్రంలో సులబ్ కాంప్లెక్స్ లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ బింగి దాసుగౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించి స్థలం చూపిస్తే వెంటనే రూ. 5లక్షల నిధులు మంజూరు చేసి సులబ్ కాంప్లెక్స్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం క్యాంపు కార్యాలయనికి వచ్చి పనులు చేయించుకోవాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్బర్అలీ, పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, బాటసింగారం సహకార బ్యాంక్ చైర్మన్ లెక్కల విఠల్రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్పాష, సర్పంచ్లు సీహెచ్ కిరణ్కుమార్గౌడ్, జక్క లావణ్య, కవాడి శ్రీనివాస్ రెడ్డి, కావలి రంగయ్య, ఎరవెల్లి లతశ్రీ, అంతటి యశోద, దూసరి సుజాత, ముద్దం స్వరూప, బుర వీరస్వామిగౌడ్, మూల మహేశ్గౌడ్, తుడుం మల్లేష్, ఎంపీటీసీలు కేశెట్టి వెంకటేష్, చేగూరి వెంకటేశ్, రాచపాక లావణ్య, కౌన్సిలర్లు సిద్దెంకి కృష్ణారెడ్డి, చెవుల హరిశంకర్, పాశం అర్చన, అధికారులు, పలు పార్టీల నాయకులు ఉన్నారు.