ప్రముఖ స్పోర్ట్స్ వేర్ యాక్సెసరీస్ బ్రాండ్ ‘ఆసిక్స్’ తన బ్రాండ్ అంబాసిడర్గా టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను నియమించినట్లు మంగళవారం ప్రకటించింది. జడ్డూ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా మరింతగా విస్తరించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో చెప్పింది. రన్నింగ్ కేటగిరీలో తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చూస్తామని, ఈ ఒప్పందం విభిన్నమైన ఉత్పత్తుల గురించి అవగాహన పెంచుతుందని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో బ్రాండ్ మరింత ఎక్కువ మందికి చేరువ అవుతుందని వెల్లడించింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తాచాటే జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 425 వికెట్లు పడగొట్టి, 4వేల పరుగులు పూర్తి చేశాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఒకే ఓవర్లో 37 పరుగులు రాబట్టి క్రిస్గేల్ పేరిట ఉన్న రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. . ‘ఆసిక్స్’ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ జడేజా ట్వీట్ చేశాడు.