తాండూరు : వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని విభిన్న రూపాల్లో విఘ్నేశ్వరుడు కొలువుదీరి భక్తులతో నిత్యం పూజలు అందుకుంటున్నాడు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ పరిధిలో వివిధ ఆకృతుల్లో కొలువుదీరిన వినాయకుని కి భక్తులు ఉండ్రాళ్లు, లడ్డూలు, పంచభక్ష పరమన్నం, ప్రకృతిలో లభించే పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్తో పాటు నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.