మొయినాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు శంకర్పల్లి గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాల తరగతి గదులు, బాత్రూమ్లు, డార్మెంటరీ గదులు, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయడానికి అనుభవం గల వారు ముందుకు వచ్చి టెండర్లను కైవసం చేసుకోవాలని సూచించారు. సీలింగ్ రేటు నెలకు రూ. 25 వేలు గురుకుల విద్యా సంస్థ నిర్ణయించిందని తెలిపారు.
ఇద్దరు స్వీపింగ్కు, ఇద్దరు శానిటేషన్ వర్కర్లు మొత్తం నలుగురు అవసరం అని చెప్పారు. ఆసక్తిగల వారు ప్రిన్సిపాల్, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ శంకర్పల్లి, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా పేరుతో రూ. 1000 డీడీని పాఠశాల కార్యాలయంలో అందజేసి టెండర్ ఫారమ్ను పొందవచ్చని తెలిపారు. టెండర్లు వేయిటకు ఆగస్టు 30నుంచి సెప్టెంబర్ 1 వరకు సమయం ఇవ్వడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 2న 3 గంటలకు పాఠశాల కార్యాలయంలో టెండరు దార్ల సమక్షంలో టెండర్ బాక్స్ తెరవడం జరుగుతుందన్నారు.