వికారాబాద్ : వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్నటువంటి ఆయా మండలాల బస్ స్టాండ్లలో కార్గో పార్సిల్ కొరియర్ కౌంటర్లను ప్రైవేట్ ఏజెంట్లకు అప్పగించడం కోసం టెండర్లు కోరుతున్నట్లు వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ దైవాదినం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలో వికారాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, మోమిన్పేట, నవాబుపేట, మర్పల్లి బస్ స్టేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. టెండర్ల ఫామ్స్ను ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ ఫామ్లు డిపో మేనేజర్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మబడుతాయని తెలిపారు. వికారాబాద్, చేవెళ్ల ఏజెంట్ కోసం ఫామ్ ధర రూ. 885లు, మన్నెగూడ, మోమిన్పేట, నవాబుపేట, మర్పల్లి ఏజెంట్ల కోసం టెండర్ ఫామ్స్ రూ. 295లు ఉంటుందన్నారు. దరఖాస్తు పూర్తి చేసిన ఫారాలను సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రూ. 2:30 గంటలలోపు టెండర్ బాక్స్లో వేయాలన్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ఓపెన్ చేసి పైనలైజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.