ఆమనగల్లు : మేడిగడ్డలో తీజ్సంబురాలు అంబరానంటాయి. గిరిజన మహిళలు సంప్రాదాయ దుస్తులు ధరించి డప్పుచప్పులు, ఆట-పాటలతో వేడుకలను జరుపుకున్నారు. గురువారం వేడుకలకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై బుట్టలను నెత్తిపై ఎత్తుకుని అందరిని సంబురపరిచారు.
గిరిజనులు ప్రతీయేటా నిర్వహించే తీజ్పండుగ వేడుకలు భావితరాలకు ఎంతో ఉపయోగపడుతాయని వారు పేర్కొన్నారు. అనంతరం తండాలో మహిళలు తీజ్బుట్టాలను నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్చించారు. పంటలు బాగా పండాలని, పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడకుండా చల్లంగా కాపాడాలి తల్లి అంటూ గిరిజనులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల తండావాసులతో పాటు ఆమనగల్లు పట్టణం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.