తాండూరు రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ సందీప్రెడ్డి, కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నాటక సరిహద్దులోని ఎల్లమ్మ దేవాయల అభివృద్ధికి తనంతు సంపూర్ణ సహకారం ఉంటుదని తెలిపారు.
కర్నాటకతో పాటు మహారాష్ట్ర నుంచి అధికంగా భక్తులకు విచ్చేసి మొక్కలు చెల్లించుకుంటున్నారని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో నూతన పాలకవర్గం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ కృషితో దేవాలయల్లో పూజలు నిర్వహించే పూజారులకు గౌర వేతనం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఆలయాల పునర్దోరణకు అధిక నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు.
ఆలయ చైర్మన్గా సందీప్రెడ్డి
మండలంలోని శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్గా సందీప్రెడ్డిచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా పాలకవర్గ సభ్యులుగా సురేశ్ కుమార్, వెంకటప్ప, పెద్దింటి మొగులప్ప, ఈడ్గీ లక్ష్మి, పద్మమ్మ, శ్యామల పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రాంరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాందాస్, రైతుబంధు సమితి కన్వీనర్ రాంలింగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, ప్రదీప్రెడ్డి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శకుంతల, ఎంపీటీసీ సాయిరెడ్డి, సీనియర్ నాయకులు ఉమాశంకర్, రాజు, ది గని కార్మిక సంఘం సభ్యులు కోతి గోపాల్, బోయిని నర్సింలు, డాక్టర్లు జయదీప్రెడ్డి, సంపత్కుమార్ ఉన్నారు.