హైదరాబాద్ ఆఫీస్లో కల్పిస్తున్న సంస్థ
హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ మాస్ మ్యూచువల్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)లో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సిబ్బంది సంఖ్యను 1,000కి పెంచుకోవాలనుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ కారణంగా వ్యాపార రంగాలు కుదేలైనప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి సిబ్బంది సంఖ్యను 450 నుంచి వెయ్యికి పెంచుకోనున్నట్లు జీసీసీ హెడ్ రవి తంగిరాలా ఈ సందర్భంగా తెలిపారు. టెక్నాలజీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న సెంటర్లో ఉద్యోగులకు సరిపడేంత స్థలం లేకపోవడంతో బీఎస్ఆర్ ఐటీ సెజ్ పార్క్లో మరో ఫ్లోర్కు విస్తరించే ప్రణాళిక కూడా ఉన్నదన్నారు. దీంతో మొత్తం స్థలం 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరుకోనున్నది. ప్రస్తుతం అమెరికాలో సంస్థకు 6 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వయిజరీ కౌన్సిల్లో తంగిరాల సభ్యుడిగా కొనసాగుతున్నారు.