చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా సయ్యద్ అక్బర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సయ్యద్ అక్బర్ శంకర్పల్లి మండలంలోని జన్వాడ ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూనే శంకర్పల్లి, చేవెళ్ల మండలాల అదనపు విద్యాధికారిగా పూర్థిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆదివారం ఖైరతాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ అక్బర్ మాట్లాడుతూ ఉత్తమ ఎంఈవో అవార్డుతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా స్థాయిలో అవార్డు రావడం అనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించేలా కృషి చేస్తానన్ని తెలిపారు.