మొయినాబాద్ : అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ గత నెలలో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరామర్షించారు. బుధవారం హిమాయత్నగర్లో మృతుడు జర్నలిస్టు లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యుల్లో ఆత్మస్థ్యేరాన్ని నింపారు. కొన్ని ఏండ్లుగా మొయినాబాద్ మండలంలో జర్నలిస్టుగా పని చేస్తున్న మాసగల్ల లక్ష్మణ్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకోసం నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందాడు. అయితే అతని ఆరోగ్యం క్షిణించడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి గత నెల 20న మృతి చెందాడు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు ఎస్సీ, ఎస్టీ గెజిటేడ్ ఉద్యోగుల సంఘం తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బీంరాజ్ కుటుంబాన్ని పరామర్షించారు. అనంతరం ఎమ్మెల్యే మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి రావాల్సిన సహాయం అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. వారితో పాటు సీఐ రాజు, జర్నలిస్టులు ఉన్నారు.