దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్స్పైర్ పోటీల్లో విజయం సాధించిన దౌల్తాబాద్ మండలం గోకఫస్లవాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ సిబ్బంది సందర్శించారు. సందర్శనలో భాగంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థి దాసరి ఆశోక్ జాతీయ స్థాయిలో ఇన్స్స్పైర్ పోటీల్లో 3వ స్థానం కైవసం చేసుకోవడంతో అతని ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని, గైడ్ టీచర్ను అభినందించారు. సందర్శించిన వారిలో గణితం, విజ్ఞాన శాస్త్రం విభాగం సిబ్బంది ఉమారాణి, సురేష్బాబు, జగధీశ్వర్రెడ్డి ఉన్నారు.