కడ్తాల్ : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండలంలోని పోశమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా, శుక్రవారం మండలంలోని 24మంది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, ఎంపీవో టీంలు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీటీసీ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగించడంతో పాటు శారీరకంగా దృఢత్వంగా ఉండొచ్చని తెలిపారు. విద్యార్థులు, యువకులకు చదువులు ఎంత ముఖ్యమో, క్రీడలు అంతే ముఖ్యమన్నారు.
క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నదని వివరించారు. ఈ మ్యాచ్లో మండల ఎంపీడీవో-2 టీంపై ఎంపీడీవో-1 టీం గెలుపొందింది. కార్యక్రమంలో సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, దేవానాయక్, యాదయ్య, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, రైతుబంధు సమితీ జిల్లా సభ్యుడు పరమేశ్, నాయకులు గంప శ్రీను, గణేశ్గౌడ్, రాజు, సంతోశ్, బీమ్లానాయక్, సురేశ్, భీక్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.