షాద్నగర్టౌన్ : శ్రావణ మాసం నాగుల, గరుడ పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయా దేవాలయా ల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం ఆవరణలోని పుట్ట వద్ద శుక్రవారం మహిళలు, యువతలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి దేవాలయం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు.
అదే విధంగా పుట్ట వద్ద భక్తులు పాలు, కోడిగుడ్లు, పిండి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ పంచమిని పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న గరుడ దేవుడికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.