శంకర్పల్లి రూరల్ : ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని డీపీవో శ్రీనివాస్ రెడ్డి, డీఎల్పీవో శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న హరితహార కార్యక్రమానికి సంబంధించిన పలు వివరాలను శంకర్పల్లి మండలం ఎంపీడీవో సత్తయ్య, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులతో శనివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యదర్శులు ప్రభుత్వం సూచించిన నియామ నిబంధనలను తుచాతప్పకుండా పాటించాలని గుర్తు చేశారు. మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలకు హరితహార కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించి సంరక్షించే చర్యలపై వారికి సలహాలు సూచనాలు ఇవ్వలన్నారు.