శంకర్పల్లి : శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్లో ఆదివారం సౌత్రామని మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు, ప్రగతి రిసార్ట్ అధిపతి డాక్టర్ జీబీకే రావు, జీవీ కుమారి దంపతుల ఆహ్వానం మేరకు సౌత్రామని మహా యాగానికి అంకురార్పన జరిగింది. యాగ యజమానులు యామవరం అనంత క్రిష్ణసోమయాజి, యామవరం మాధురి దంపతుల పర్వవేక్షణలో ఈ యాగం ముగియనున్నది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో 12రోజుల పాటు ఉత్కృష్ట సోమ యాగం, వాజపేయ యాగం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాగంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖ రిత్వికులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.