శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురంలో 4, 5వ వార్డుల్లో నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. 4వ వార్డు అధ్యక్షులుగా ఇటుకపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డప్పు శ్రీనివాస్, కార్యదర్శిగా గుంతల కాంతిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వానరాశి శంకరయ్యను, కోశాధికారిగా ఏనుగు శేఖర్రెడ్డిలు ఎన్నుకొనగా 5వ వార్డు అధ్యక్షులుగా నోముల అనంత రాములు, ఉపాధ్యక్షులుగా పంతం రవి, కార్యదర్శిగా కానాపురం శ్రీనివాస్గౌడ్, సంయుక్త కార్యదర్శిగా మడికట్టు పాండు, కోషాధికారిగా గుంతల విఠల్రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా 11 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, మండల టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, వాసుదేవ్కన్నా, కౌన్సిలర్లు లక్ష్మమ్మ, గోపాల్, చంద్రమౌళి, కో- ఆప్షన్ సభ్యులు ఎండీ మహమూద్, నాయకులు రాంరెడ్డి, పాండురంగారెడ్డి, భరత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్కుమార్ ల్గొన్నారు.