షాద్నగర్ : మైనింగ్ తవ్వకాలపై గ్రామ ప్రజల సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి వివరిస్తామని జిల్లా అధనపు కలెక్టర్ తిరుపతిరావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి దయానంద్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ తవ్వకాలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించవనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. మైనింగ్ తవ్వకాల ద్వారా ఈ ప్రాంత ప్రజల జీవన విధానానికి విగాదం కలిగించే విధంగా పనులు జరుగవని, తవ్వకాలపై సందేహాలు, ఇతర సమస్యలు ఉంటే నేరుగా చేపొచ్చని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కంసాన్పల్లి, విఠ్యాల, గిరాయిగుట్ట గ్రామాల ప్రజలు తమ సందేహాలు, సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో విఠ్యాల, కంసాన్పల్లి, గిరాయిగుట్ట గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.