షాద్నగర్రూరల్ : ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎక్కడ నిస్సహయులు, అనాథలు కన్పించిన చేయుతునిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఇదే కోవలో బుధవారం షాద్నగర్ పట్టణంలో గుర్తు తెలియని బాలుడు ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీస్ దస్తయ్య బాలుడిని స్టేషన్కు తీసుకేళ్లాడు. బాలుడిని వివరాలు అడుగగా అమ్మ, బ్యాంక్ అని చెప్పడంతో ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ పట్టణంలోని అన్ని బ్యాంక్ల వద్ద బాలుడి వివరాలు తెలుపుతుండగా స్టేట్ బ్యాంక్ సమీపంలో బాలుడి తల్లి తప్పిపోయిన బాలుడు కోసం ఏడుస్తు ఉండాటాన్ని గుర్తించారు. ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బాలుడిని అప్పంగించారు. తప్పిపోయిన బాలుడిని తల్లి ఒడికి చేర్పించినందుకు ట్రాఫిక్ పోలీసులకు బాలుడి కుంటుంబ సభ్యులు ధన్యవాదలు తెలిపారు. పోలీసుల ఔదర్యాన్ని మెచ్చుకుని పట్టణ ప్రజలు ప్రశంసించారు.