షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీ శివ హనుమాన్ కాలనీలో నూతనంగా నిర్మించిన రుద్రాక్ష శివహనుమాన్ దేవాలయంలో విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ పూజ కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే దేవాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయంలో విగ్రహా ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతవరణం నెలకొందన్నారు. దైవచింతనను అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత ఉంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.
అదే విధంగా పూజ కార్యక్రమాలలో భాగంగా పట్టణానికి చెందిన ప్రశాంత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, విగ్రహా ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను దేవాలయ నిర్వహకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు వన్నాడ వెంకటేష్, చెన్నయ్య, జైరామ్ పాల్గొన్నారు.