షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల గడవు ఈ నెల 18 వరకు పెంచడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులందరూ గ్రహించాలన్నారు. ఓపెన్ డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ద్వితీయ, తృతీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఫీజ్ను ఈ నెల 18లోగా చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు స్టడీ సెంటర్ను సంప్రదించాలని కోరారు.