షాద్నగర్ : కరోనా వ్యాధి వ్యాప్తిని పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకురావాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని కరోనా టీకా పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి టీకా వేసే తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కరోనా వ్యాధిని నియంత్రిచడంలో సఫలీకృత మైందని, రానున్న రోజుల్లో వైద్య సదుపాయలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2కోట్లకు పైగా డోసులు వేసుకున్నారని తెలిపారు. అతి త్వరలోనే షాద్నగర్ 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ సాయిప్రసాద్యాదవ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.