షాద్నగర్ : తెలంగాణ వీరనారీమణి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటితరం మహిళలకు, యువతకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన నిలిచి, రజకార్లకు ఎదురోడి పోరాడిన వీర వనిత అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆమె ఆశయసాధన దిశగా పయనించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, సర్వర్పాష, అంతయ్య, జిటీ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.