షాబాద్ : తెలంగాణ కోసం పరితపించిన మహానీయుడు కాళోజీ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గురువారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ మన తెలంగాణ బిడ్డ కావడం మనకు గర్వకారణమని అన్నారు. 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడని వివరించారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోవ్సతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.