చేవెళ్ల : ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేయాలని ఎంఈవో అక్బర్ తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ఎంఈవో అక్బర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానునందున ప్రతి పాఠశాలను శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెత్త, చెదారం తొలగించి, తరగతి గదులను శుభ్రం చేసి పాఠశాల గదులను శుభ్రం చేసి శానిటేషన్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు ఉన్నారు.