షాబాద్ : రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ తదితర వాటిపై గురువారం మంత్రి కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి విద్యతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెలూన్లు, దోభీ ఘాట్లు వద్ద 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంట్లో సెలూన్, ఇస్త్రీ షాపులు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి నెల 250 యూనిట్లు అంటే సుమారు రూ. 2వేలకు పైగా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.