షాద్నగర్టౌన్ : మిషన్భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీళ్లను అందించడమే సర్కార్ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని 22వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మిషన్భగీరథ పైపులైన్ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క ఆడబిడ్డ నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న పైపులైన్ పనులకు అందరూ సహకరించాలన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకుసాగుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరియాదవ్, యాదగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.