ఆమనగల్లు : ప్రభుత్వ నిబంధనలు పాటించి వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని ఆమనగల్లు సీఐ ఉపేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండల కేంద్రాలతో పాటు గ్రామాలల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తును సమర్పించాలని సూచించారు.
అట్టి దరఖాస్తును పరిశీలించి మండపాల ఏర్పాటు కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారం అనుమతి ఇస్తామని తెలిపారు. నిబంధనలు పాటించకుండా అనుమతి లేకుండా మండలపాలను ఏర్పాటు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల ఏర్పాటు చేసుకునేవారంతా కింది నిబంధనలు పాటించాలి.