ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో శనివారం భక్తిశ్రద్ధలతో ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సాముహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషేకం, సాయిశ్వర మహాలింగమునకు పంచామృతాలతో అభిషేకం వంటి కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేశారు. ఉత్సవాలను తిలకించడానికి ఆమనగల్లు పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో సత్యసాయి నామస్మరణలతో ఆలయం మారుమోగింది.