పరిగి, మార్చి 16 : రోడ్డు పనులు వేగంగా చేపట్టాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. పరిగి నుంచి షాద్నగర్ రోడ్డు జిల్లా సరిహద్దు వరకు రూ.5.80కోట్లతో చేపట్టనున్న మరమ్మతు, రీ బీటీ పనులను గురువారం రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ శ్రీనివాస్రావుతో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతూ పనులు సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని అన్నారు. పరిగి నుంచి జిల్లా సరిహద్దు వరకు పూర్తిగా రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిందిగా సూచించారు. అదనపు నిధుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిగి-షాద్నగర్ రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, అందువల్ల పనులు వేగంగా, మరింత నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణంతోపాటు పాడైన రోడ్ల మరమ్మతుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ సురేందర్, ఏఈలు మహేశ్, సుస్మిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్లు వెంకట్రాంకృష్ణారెడ్డి, జగన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ పాల్గొన్నారు.
నీట్ పీజీలో జాతీయ స్థాయిలో 527 ర్యాంకు సాధించిన పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి కూతురు ప్రజ్ఞను గురువారం పరిగిలోని తమ నివాసంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సన్మానించడంతోపాటు అభినందించారు. విద్యా రంగంలో బాలికలు చక్కటి ఫలితాలు సాధిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సురేందర్రెడ్డి, నర్సింహులు, ప్రదీప్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
పరిగి మండలం మాదారం గ్రామంలో సేరి రంగారెడ్డి, మాణెమ్మ దంపతులకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు. వృద్ధ దంపతులు ఇంటి నిర్మాణం చేపడుతుండడంతో వారికి ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు.
కులకచర్ల : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న కార్యకర్త ఎర్రం రాజు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసిన రెండు లక్షల బీమా ప్రీమియం మంజూరు కావడంతో రాజు భార్యకు రెండు లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాల మహిపాల్రెడ్డి, ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, బీఆర్ఎస్ కులకచర్ల మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, ఎంపీటీసీ చందన బాల్రెడ్డి, బొంరెడ్డిపల్లి సర్పంచ్ ఆంజనేయులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, బీఆర్ఎస్ నాయకులు కడంపల్లి రఘు, మాలె కృష్ణయ్యగౌడ్, రాజప్ప, జనార్ధన్రెడ్డి, మొగులయ్య, రాజు, నర్సింహులు, కామునిపల్లి మాజీ సర్పంచ్ బాలయ్య, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.