తాండూరు, జనవరి 26: వసంతపంచమిని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలల్లో గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ సాయి మేధ విద్యాలయం, సరస్వతీ శిశుమందిర్లో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య తల్లిండ్రులు చిన్నారులు భక్తిశ్రద్ధలతో అక్షరభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్య క్షుడు ప్రశాంత్కుమార్, రమేశ్కుమార్ మాట్లాడుతూ జ్ఞానం, వాక్కు, విద్య మొదలైన శక్తులే సరస్వతీ మాత అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గురుస్వామి జైపాల్రెడ్డి మాట్లాడుతూ ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన జరిపినప్పటికీ దేశ సంస్కృతి, సం ప్రదాయాలను విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బొంరాస్పేట, జనవరి 26 : వసంత పంచమి పర్వదినాన్ని గురువారం మండలంలోని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువులతల్లి సరస్వతిదేవికి పూజలు చేశారు. చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. బొంరాస్పేట స్వామి వివేకానంద పాఠశాలలో కరస్పాండెంట్ నర్సింహులు, హెచ్ఎం చంద్రకళ సరస్వతిదేవికి పూజలు చేసి చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేయించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిగి టౌన్, జనవరి 26 : వసంత పంచమి సందర్భంగా గురువారం పరిగి పట్టణంలోని సరస్వతి శిశుమందిరం పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వ హించారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయిం చారు. కార్యక్రమంలో ఎస్సై విఠల్రెడ్డి, ప్రధానాచార్యులు మల్లేశం, బీజేపీ జిల్లా కార్యదర్శి హరియాదవ్, డాక్టర్ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.