మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీడీపీ నాయకులకు పార్టీ కండువాలను కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందే విధంగా చూడాలని సూచించారు.
పార్టీలో చేరిన వారిలో పండుగుల శ్రీకాంత్, వినయ్, అజయ్, సుధీర్, కొప్పు వినయ్లు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, నాయకులు కావలి శ్రీనివాస్, కందాల శ్రీశైలం, మార సురేశ్, నూతన గంటి శేఖర్, పున్నం రాము, పూజారి శ్రీరాములు, ఏరేశ్ యాదవ్, లక్ష్మణ్గౌడ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.