నందిగామ : నందిగామ మండలం నర్సప్పగూడ, ఈదులపల్లి గ్రామాల్లో బుధవారం నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులు పొందుతున్న రుణాల గురించి ఆరా తీశారు. పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, వైకుంఠధామల పనులను పరిశీలించారు.
నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ అధికారులు సుందర్ పాండ్యన్, నెహ్రూ, నీరజ, నందిగామ ఎంపీడీవో బాల్రెడ్డి, డీపీఎం సూర్యనారాయణ, ఏపీఎం యాదగిరి, ఎంపీవో గిరిరాజ్, నర్సప్పగూడ సర్పంచ్ అశోక్, ఈదులపల్లి సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.