కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూరు టీఆర్ఎస్ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అందులో భాగంగా శనివారం ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయ్యయాదవ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు కడాల శ్రీశైలం, కమిటి సభ్యులతో కలిసి ఎమ్మెల్యేను పూలమాల, శాలువతో సన్మానించగా అనంతరం కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణతో పార్టీకి లోబడి పనిచేయాలని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని అన్నారు. పార్టీలో ఉండి పార్టీ నియమనిబంధనలకు లోబడి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో మంచి భవిష్యత్ ఉందన్నారు. అటువంటి వారికి ఉన్నతమైన పదవులు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైఎస్ చైర్మన్ పద్మారావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేశాల భీమయ్య, నాయకులు పెంటనోళ్ల యాదగిరి, దామోదర్రెడ్డి, రాజు, లింగం నాయక్, ఇంద్రసేనారెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.