షాద్నగర్రూరల్ : జిల్లాలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని మహిషాసురమర్థిని రూపంలో అలంకరించారు. ఉదయం నుంచే అమ్మవారికీ అభిషేకలు, హోమం, పల్లకిసేవా, పూర్ణహుతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజ కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని శక్తిస్వరూపుణికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి వద్ద నిర్వహించిన భజన, పల్లకి సేవాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అమ్మవారి భజన పాటలు పాటలు ఆలపించి భక్తులలో మరింత ఉత్సహం నింపారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు పూలమాలలతో సత్కారించారు.