షాబాద్ : ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని చందనవెళ్లి గ్రామానికి చెందిన రాంరెడ్డికి రూ. 2లక్షలు, మల్లేశ్కు రూ. 30వేలు, శివకుమార్కు రూ. 16వేలు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి పథకం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలన్ ప్రభాకర్రెడ్డి, గ్రామస్తులు రామస్వామిగౌడ్, మల్లేశ్, విష్ణు, ప్రభాకర్, బాల్రాజు, బషీర్ తదితరులు ఉన్నారు.