తలకొండపల్లి : ప్రభుత్వం ప్రతి చెరువులో చేప పిల్లలు వదులుతున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునిపడకల్, గట్టుఇప్పలపల్లి, వెంకట్రావ్పేట, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువులో చేపపిల్లలను వదిలి మాట్లాడారు. మండలంలోని అంతారం, చీపునుంతల, పడకల్, యడవెల్లి, రాంపూర్తో పాటు పలు గ్రామాల్లోని చెరువులతో పాటు కుంటల్లో చేప పిల్లలు వదిలామన్నారు. గ్రామాల్లో ముదిరాజులు సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన వారికి రూ.6లక్షల ఇన్సూరెన్స్ ఉందన్నారు.
ముదిరాజులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు శ్యాంసుందర్రెడ్డి, రమేశ్, ఈశ్వర్, శ్రీశైలం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శంకర్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, రాజేందర్రెడ్డి, తిరుపతి, స్వామిగౌడ్, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.