షాద్నగర్ : దసరా పండుగ మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. శ్రీవాసవి మాత దేవాలయంలో శరనవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటితరం యువతకు తెలియజేయాలని చెప్పారు. అమ్మవారి కృపతో పాడి పంటలు పుష్కలంగా పండాలని, వ్యాపార అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదుగాలని, ప్రజా సేవాలో భాగస్వాములు కావాలని కోరారు.
ఇందులో భాగంగానే ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఆర్య వైశ్య సంఘం నాయకులు సరాపు రమేశ్, నందకిషోర్, బాదం సుధాకర్, శ్రీనివాస్గుప్తా, అనంత లక్ష్మీ, నవీన్, సురేష్, మొహన్రావు, వెంకటరమణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.