కొత్తూరు రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాయమాటలకు ప్రజలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్తండా గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలను చేస్తున్నరని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ఇంటింటికీ చేరుతుందని ఆ విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్లాపూర్తండా గ్రామకమిటీ అధ్యక్షుడు లిబియానాయక్, ఉపాధ్యక్షుడు రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.